పారిశుద్ధంపై అవగాహన కల్పించిన ఎంపీడీవో అరుణ రాణి

Published: Thursday December 15, 2022
జన్నారం, డిసెంబర్ 14, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హులికేరి పారిశుద్ధ్యపై అవగాహన ఆదేశాలతో జన్నారం మండలానికి చెందిన 29 మంది గ్రామ ఐక్య సంఘ సభ్యులతో, నాయకులతో బుధవారం ఎంపీడీఓ అరుణా రాణి మండల అభివృద్ధి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో పారిశుధ్యం, విభజన కార్యక్రమాలను వివరించారు. ఇళ్లతో పాటు, గ్రామంలో మెరుగైన పారిశుధ్యం కోసం గ్రామాల సభ్యులందరినీ ప్రోత్సహించాలని అభ్యర్థించారు. అదేవిధంగా మండలంలోని గ్రామాల అభివృద్ధికి అందరూ సహకరించాలని స్పష్టం చేశారు. మండలంలోని కలమడుగు, ఇంధన్ పల్లి, మురిమడుగు, గ్రామాలలో ఎంపీడీవో అరుణ రాణి, ఎంపీఓ రమేష్ పర్యటించారు. మండలంలోని గ్రామాలలో ఉన్న పల్లె ప్రకృతి పార్కులు, ప్రకృతి నర్సరీలను సందర్శించారు. ప్రతి గ్రామ అభివృద్ధి, ప్రభుత్వ ఆయా నిర్మాణాలను చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో, రమేష్, ఏపీఎం, ఏపీఓ, బుచ్చన్న, గ్రామ అధికారులు, ఎంఎస్‌ నాయకులు, వీఓ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.