పారిశుద్ధ్య కార్మికుల కష్టాలకు గుర్తింపు

Published: Tuesday January 11, 2022
ఇబ్రహీంపట్నం జనవరి 10 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులకు పట్టణ ప్రజల బాగోగుల కై నిరంతరం శ్రమించే పారిశుద్ధ్య కార్మికుల కష్టాలను గుర్తించి, ముఖ్యమంత్రి కెసిఆర్ వారికి 30% జీతాలను పెంచటం చాలా ఆనందంగా ఉంది. మున్సిపల్ చైర్మన్ స్రవంతి అన్నారు. సంక్రాంతి పండుగ రాబోయే ముందు వారికి ఈ ఆనందాన్ని కల్పించటంలో ముఖ్యమంత్రి  కేసీఆర్ కు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కి  కార్మికుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి వారి జీతాలు పెరుగుటలో బాగస్వామ్యులు అయిన మన ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు. మున్సిపల్ చైర్మన్ కప్పరి స్రవంతి చందు.