C.M రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

Published: Wednesday February 02, 2022

భట్టి విక్రమార్క చొరవతో సీఎం సహాయ నిధి చెక్కు మంజూరు

మధిర ఫిబ్రవరి 1 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో మంగళవారంం నాడు మండల కాంగ్రెస్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ చెక్కుల పంపిణీ మధిర మండలంలోని సిద్దినేని గూడెం గ్రామం లోని సాగి నాగేశ్వరమ్మ అనారోగ్యంతో బాధపడుతూ కుటుంబ ఆర్దిక పరిస్థితులు దృష్ట్యా సీఎం సహాయ నిధి నుండి ఆర్దిక సహాయం అందించాలని కోరుతూ. మధిర శ్యాసన సభ్యులు మల్లుభట్టి విక్రమార్క ద్వారా దరఖాస్తు చేసుకోగా మల్లుభట్టి విక్రమార్క సిఫార్సు మేరకు సీఎం సహాయ నిధి నుండి చెక్కు మంజూరు అయినది. కాగా అట్టి చెక్కును ఈ రోజు మధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూరం శెట్టి కిశోర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మిర్యాల వెంకటరమణ గుప్తా చేతుల మీదుగా అందించటం జరిగింది, లబ్దిదారులకు వివరాలు.. సాగి నాగేశ్వరమ్మ.. సిద్దినేని గూడెం.. 37,500 వారికి అందించటం జరిగింది.. ఈ కార్యక్రమంలో మధిర మధిర మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు దారా బాలరాజు మధిర మండల బీసీ సెల్ అధ్యక్షుడు చిలువేరు బుజ్జి రామయ్య టౌన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జహంగీర్, పగిడిపల్లి డేవిడ్ బానోతు వెంకటరమణ మైలవరపు చక్రి మొదలగు వారు పాల్గొన్నారు.