ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలి.. తల్లాడ పంచాయతీ ఈవో నాగేశ్వరరావు..

Published: Tuesday October 25, 2022
తల్లాడ, అక్టోబర్ 23 (ప్రజా పాలన న్యూస్): ప్రజలందరి జీవితాల్లో దీపావళి వెలుగులు విరజిల్లాలని తల్లాడ మేజర్ పంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ దీపావళి పండగ విజయానికి ప్రతీక అన్నారు. పండుగ రోజు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.