పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరాం ను గెలిపించాలి

Published: Wednesday February 24, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి ప్రస్తుతం జరుగనున్న నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రొపెసర్ కోదండరాం కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని నియోజకవర్గ ఇంచార్జ్ సలీం పాషా పట్టభద్రులను కోరారు. ఈ సందర్భముగా ఆయన మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో, ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయులను కలిసి కోదండరాం కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సునీల్, రాజు, పవన్ కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.