క్లాసులు చెప్పేవారు లేక అంబేద్కర్ స్టడీ సెంటర్ బయట సైకాలజీ విద్యార్థులు
హైదరాబాద్ 27 నవంబర్ ప్రజాపాలన: అందరికీ విద్య అనే నినాదంతో అంబేడ్కర్ సార్వత్రిక యునివర్సిటీ పనిచేస్తుంది.ఎంతో మంది వివిధ కారణాల వల్ల మధ్యలో చదువు కొనసాగించలేక పోయారు.అలాంటి వారి కోసం పని చేసుకుంటూ తమ చదువులు కానీ సాగించాలనే ఆశయం తో పిజి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకున్నారు. 27 నవంబర్ నుండి పిజి క్లాసులు ఉంటాయని తెలిపే విధంగా యునివర్సిటీ నోటీసు బోర్డులో ఉంచారు. మరియు సంబంధిత విద్యార్థులకు నిక్షిప్త సమాచారం చరవాణీలకు అందించారు. ఈ సమాచారం ఆధారంగా జూబ్లీ హిల్స్ లోని 228 స్టడీ సెంటర్ కు వివిధ ప్రాంతాల నుండి సైకాలజీ, బి.యల్. ఎస్.ఐ.,యం. ఎల్.ఎస్.ఐ విద్యార్థులు క్లాస్ నిమిత్తం హాజరు అయ్యారు. ఆదివారం అయినా శ్రమ కోర్చి విద్యార్థిని విద్యార్థులు తమ పిల్లలను భర్తలను వెంటేసుకుని సుదూర ప్రాంతాలనుండి యునివర్సిటీ స్టడీ సెంటర్ కు వస్తే ఈరోజు క్లాసులు లేవని తలుపులు మూసి ఉంచారు.
Share this on your social network: