మధిర రెస్క్యూ టీం ను వరించిన స్వామి వివేకానంద లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు

Published: Monday July 05, 2021

మధిర, జులై 04, ప్రజా ప్రతినిధి : అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. అనేకమంది అనాధల పాలిట దేవుడిగా.. ఎన్నో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించి. ఎంతో మంది ఆపదలో ఉంటే రక్షించి. ఆకలి అన్న వాడికి అన్నం పెడుతూ.. మధిర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మధిర రెస్క్యూ టీం చైర్మన్ దోర్నాల రామకృష్ణ నిస్సి హరినీ లను. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు.. బొమ్మెర రామ్మూర్తి దోర్నాల రామకృష్ణ నివాసంలో కలిసి సత్కరించారు.. ఈ సందర్భంగా రామ్మూర్తి గారు మాట్లాడుతూ.. మధిర ప్రజలకు ఎంతగానో సేవ చేస్తున్న రామకృష్ణ నిస్సి హరినీ లకు తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందజేస్తామని ముందు ముందు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి పేద ప్రజలకు అండగా నిలవాలని.. స్వామి వివేకానంద లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు హైదరాబాదులో ఈ నెల 25వ తారీకు నాడు అందుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని.. కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ శివాలయం చైర్మన్. కోమటిడి. శ్రీనివాసరావు. దోర్నాల దినకరన్. జాగృతి బొబ్బిలపాటి. బాబురావు. కంభంపాటి కిరణ్ కుమార్. డెంటల్ డాక్టర్ లక్ష్మీపతి. పేరోళ్ల. శ్రీను మోహన్ చైతన్య పలువురు పాల్గొన్నారు.