దక్షిణ భారతదేశ సైన్స్ ఫెయిర్ 2023లో సత్తా చాటిన జాడి జగదీశ్వర్

Published: Wednesday February 01, 2023

జన్నారం, జనవరి 31, ప్రజాపాలన:  కేరళ రాష్ట్రంలో తిరుచూరులో జరుగుతున్న దక్షిణ భారతదేశ సైన్స్ ఫెయిర్ 2023లో మండలంలోని బాదంపెళ్లి పాఠశాలకు చెందిన 9వ విద్యార్థి జాడి జగదీశ్వర్ మంగళవారం జరిగిన ఫిజికల్ సైన్స్ దక్షిణ భారతదేశ సైన్స్ ఫెయిర్ లో ఇండివిజువల్ కేటగిరీలో రెండవ బహుమతి గెలుపొందడం జరిగిందిని గైడ్ ఉపాధ్యాయుడు దేవ రాజయ్య అన్నారు. ఈ ఈ సందర్భంగా మాట్లాడుతూ గెలుపొందిన బహుమతి కింద 5వేల రూపాయల నగదుతో పాటు మేమొంటో సర్టిఫికెట్స్ తో విద్యార్థిని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం బాదం పెళ్లి జెడ్పిఎస్ఎస్ పాఠశాలలో గైడ్ ఉపాధ్యాయుడుని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ జీవన్ బాబు ఐఏఎస్ కేరళ, వారి చేతుల మీదుగా విద్యార్థికి బహుమతిని బహుకరించారు. ఈ కార్యక్రమంలో కేరళ రాష్ట్ర గవర్నర్ అధికారులు ప్రతినిధులు విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.