ఆదర్శ పాఠశాలలో ఘనంగా ముగింపు వజ్రోత్సవ వేడుకలు
Published: Tuesday August 23, 2022
ఆసిఫాబాద్ జిల్లా ఆగస్టు 22 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖలీల్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా వేడుకల్లో భాగంగా ఉదయం ఫ్యాన్సీ పోటీలు నిర్వహించారు. సుమారు 30 మంది విద్యార్థులు వివిధ స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో పాల్గొన్నారు. మధ్యాహ్నం నృత్య పోటీలు, ఆటల పోటీలు నిర్వహించారు. గత వారం రోజులుగా నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు, రంగోలి, పోటీల విజేతలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు కోట వెంకన్న, రమణారెడ్డి, పుల్లూరు శంకర్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Share this on your social network: