జిల్లా అదనపు కలెక్టర్ కు నూతన కియా కారు
Published: Tuesday June 15, 2021
జిల్లా కలెక్టర్ పౌసుమి బసు
వికారాబాద్, జూన్ 14, ప్రజాపాలన బ్యూరో : జిల్లాలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో భాగంగా నూరు శాంతం అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో పనులలో సౌలభ్యం కొరకు రాష్ట్ర ప్రభుత్వం వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) కు కేటాయించిన కొత్త కియా వాహనమునకు కొబ్బరి కాయలు కొట్టి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పౌసుమి బసు, వికారాబాద్ శాసనసభ్యులు మెతుకు ఆనంద్లు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్యకు వాహనమును అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పౌసుమి బసు, శాసనసభ్యులు మెతుకు ఆనంద్, అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్, వైస్ చైర్మన్ శంషాద్ బేగం తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: