పట్టణ ప్రగతి కార్యక్రమంలో రోడ్లు, డ్రైనేజీ శుభ్రం చేసిన పురపాలక సిబ్బంది

Published: Tuesday June 07, 2022

రాయికల్, జూన్ 06 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ పట్టణం 1వ వార్డు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వార్డులోని రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి, రోడ్లను,మురికి కాల్వలను శుభ్రం చేసి బ్లీచింగ్ చేశారు. అనంతరం వార్డు కమిటీతో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయికల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్రరమాదేవి, కమిషనర్ సంతోష్ కుమార్  మున్సిపల్ మేనేజర్ వెంకటి, అంగన్వాడీ టీచర్, ఆశా కార్యకర్త, తదితరులు పాల్గొన్నారు.