దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Published: Thursday July 28, 2022
మేడిపల్లి, జూలై27 (ప్రజాపాలన ప్రతినిధి)
ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని దేవాలయాల సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం రాజీలేని కృషిని కొనసాగిస్తుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు.
హబ్సిగూడలోని ఉప్పల్ ఎమ్మెల్యే నివాసంలో బుధవారం ఆషాడ మాస బోనాల జాతరకు సంబంధించి మిగిలిన చెక్కులను ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆషాడ మాస బోనాల జాతర ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అవసరమైన నిధులను అమ్మవార్ల దేవాలయాలకు ప్రతి ఏటా కేటాయిస్తుందన్నారు.ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని 130 దేవాలయాలకు గాను 36 లక్షల 75 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు.