గులాబీ గళమే తెలంగాణ బలం

Published: Thursday March 31, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 30 మార్చి ప్రజాపాలన : గులాబీ గళమే తెలంగాణ బలమని వికారాబాద్ టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కోట్ పల్లి మండల పరిధిలోని కరీంపూర్ గేట్ సమీపంలోని మైసమ్మ దేవాలయం ఆవరణలో కోట్ పల్లి మండలం తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్టాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి పధంలో నడిపిస్తున్న టి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వమే రాబోవు రోజుల్లో తెలంగాణకు శ్రీరామ రక్ష అన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపిస్తూనే, కేంద్రంపై కొట్లాడుతూ మరింత అభివృద్ధికై ముందుకు సాగాల్సిన బాధ్యత ప్రతి గులాబీ కార్యకర్తదని అన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ బలమైన నాయకత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుందరి అనిల్, తెరాస పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.