పాఠశాల అదనపు అంతస్తు నిర్మాణ పనులకు శంకుస్థాపన

Published: Friday September 17, 2021
మేడిపల్లి, సెప్టెంబర్16 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని మేడిపల్లి 25వ డివిజన్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు అంతస్తు నిర్మాణం పనులను రూ40.00 లక్షల అంచనా వ్యయంతో మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, స్థానిక కార్పొరేటర్  దొంతిరి హరిశంకర్ రెడ్డి లతో కలిసి కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, 25వ డివిజన్ అధ్యక్షులు బోటుమంచి సునీల్, ప్రధాన కార్యదర్శి జెట్ట చంద్రశేఖర్, ప్రధానోపాధ్యాయులు సత్యప్రసాద్, ఉపాద్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, పెద్దలు, కాలనీవాసులు, కమిటీ మెంబర్స్, మహిళలు, మరియు, యుువత తదితరులు పాల్గొన్నారు.