ముస్లింల పీర్లచావిడి వితరణ అందించిన సర్పంచ్ గండు సతీష్.

Published: Friday July 22, 2022

పాలేరు జూలై 21 ప్రజాపాలన ప్రతినిధి

నేలకొండపల్లి

ముస్లిం ల అభ్యున్నతి కోసం తాను పాటుపడుతానని సర్పంచ్ సంఘం

మండలాధ్యక్షుడు గండు సతీష్ పేర్కొన్నారు. మండలం లోని

కోరట్లగూడెంలో నూతనంగా నిర్మిస్తున్న పీర్లచావిడి నిర్మాణానికి గురువారం రూ.25 వేల వితరణ ను అందించారు. ఈ సందర్భంగా ఆయన

మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముస్లింల కోసం అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. తన వంతుగా కూడ సహకారం ను

అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ

ఉప సర్పంచ్ వాసంశెట్టి నాగేశ్వరరావు, వార్డు సభ్యులు షేక్ లాల్పాషా. జాగీర్పాషా, చిన్న లాల్పాషా, ఫయాజ్, సోహెల్ తదితరులు పాల్గొన్నారు.*