ముస్లింల పీర్లచావిడి వితరణ అందించిన సర్పంచ్ గండు సతీష్.
Published: Friday July 22, 2022
పాలేరు జూలై 21 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి
ముస్లిం ల అభ్యున్నతి కోసం తాను పాటుపడుతానని సర్పంచ్ సంఘం
మండలాధ్యక్షుడు గండు సతీష్ పేర్కొన్నారు. మండలం లోని
కోరట్లగూడెంలో నూతనంగా నిర్మిస్తున్న పీర్లచావిడి నిర్మాణానికి గురువారం రూ.25 వేల వితరణ ను అందించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముస్లింల కోసం అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. తన వంతుగా కూడ సహకారం ను
అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ
ఉప సర్పంచ్ వాసంశెట్టి నాగేశ్వరరావు, వార్డు సభ్యులు షేక్ లాల్పాషా. జాగీర్పాషా, చిన్న లాల్పాషా, ఫయాజ్, సోహెల్ తదితరులు పాల్గొన్నారు.*
Share this on your social network: