ప్రజ సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పని తీరు : ఎమ్మెల్యే అరికెపుడి

Published: Thursday May 06, 2021

శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చేక్కలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని అర్హులైన ఆడపడుచులకు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికెపుడి గాంధీ కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని, దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పాలపాటి శ్రీకాంత్, నార్నే శ్రీనివాసరావు చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, గచ్చిబౌలి మాజీ కార్పోరేటర్ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.