పీలారం గ్రామంలో ఈద్గాకు స్థలం కావాలి

Published: Thursday April 01, 2021
వికారాబాద్ జిల్లా ప్రతినిధి మార్చి 31 ( ప్రజాపాలన ) : ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేందుకు ఈద్గా స్థలం అత్యంత ఆవశ్యకమని పీలారం గ్రామ ముస్లిం ప్రజలు కోరారు. బుధవారం వికారాబాద్ మండల పరిధిలో గల పీలారం గ్రామం ముస్లిం ప్రజలు ఎమ్మార్వో రవీందర్ కు ఈద్గా స్థలం కావాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాల్సిన స్థలము లేకపోవడంతో మసీదులోనే నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన అసైన్డ్ భూమి సర్వే నెంబర్ 39 లో ఈద్గా నిర్మించేందుకు స్థలం కేటాయించాలని ఎమ్మార్వోకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాష సర్దార్ ఖాజా పాషా చాంద్ పాషా ముస్తఫా ఎక్బాల్ తదితరులు పాల్గొన్నారు.