క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం లక్ష్యంగా సభ్యత్వ నమోదు ప్రక్రియ చేయాలి

Published: Tuesday February 16, 2021

మధిర, ఫిబ్రవరి 15 ప్రజాపాలన: రాయపట్నం గ్రామంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆధ్వర్యంలో ముమ్మరంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు. టిఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం అయ్యే విధంగా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. ఈరోజు రాయపట్నం గ్రామంలో ముమ్మరంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామాల్లోని టిఆర్ఎస్ కార్యకర్తలకు సభ్యత్వ నమోదు చేశారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రావురి శ్రీనివాస రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారి నాగేశ్వరరావు, టిఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.