కేశవపట్నం 108 అంబులెన్స్ ను తనిఖీ చేసిన కేంద్ర బృందం శంకరపట్నం జనవరి 30 ప్రజాపాలన రిపోర్టర్ :

Published: Tuesday January 31, 2023
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కేశవపట్నం108 అంబులెన్స్ ను సోమవారం కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేంద్ర బృందం సభ్యులు 108 అంబులెన్స్ ను తనిఖీ చేశారు. 108 సిబ్బంది పనితీరును  కార్డులను  మందులను పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. 108 అంబులెన్స్ సకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బృందం సభ్యులు అబ్దుల్ అఫీజ్, డాక్టర్ జ్యోతి సీఎం లోట్, 108 సిబ్బంది ఈఎంటి శ్రీధర్, పైలెట్ కాజా ఖలీల్ ఉల్లా  పాల్గొన్నారు.