ఆర్థిక శాఖ మంత్రి ని కలసిన జడ్పీటీసీ ఎర్ర చంద్ర శేఖర్

Published: Wednesday April 21, 2021

మంచిర్యల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 20, ప్రజాపాలన మండలం లో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వివరించి మరిన్ని నిధుల కోసం ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖా శ్యాం నాయక్ ఆదేశాల మేరకు జన్నారం జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్ మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ  హరీష్ రావు ను  హైదరాబాద్ లోని మంత్రి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్నారం మండల కేంద్రంలో కరోన వైరస్ కెసులు పెరుగుతున్న నేపథ్యంలో జన్నారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని 30 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేయాలని కోరినట్లు అయన తెలిపారు. ఆదే విధంగా జన్నారం మండల కేంద్రంలో కరోన ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి కోరినట్లు జడ్పిటిసి తెలిపారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖాశాంనాయక్ కరోనా సమయంలో నియోజకవర్గ మొత్తం సుడిగాలి పర్యటన చేస్తూ పల్లె ప్రగతి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు ను పర్యవేక్షణ చేస్తున్న విషయం వివరించి నట్లు తెలిపారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని అయన పేర్కొన్నారు. కరోనా పట్ల ప్రజలను చైతన్య పరుస్తూనే ప్రజా ప్రతినిధులు తమ వ్యక్తిగత ఆరోగ్య పై చాలా జాగ్రత్తగా మెలగాలని మంత్రి చూసించారని అయన తెలిపారు.