వ్యవసాయ బావిలో పడి వృద్ధుడి మృతి. శంకరపట్నం నవంబర్ 25 ప్రజాపాలన ప్రతినిధి:

Published: Saturday November 26, 2022
శంకరపట్నం మండలంలోని మెట్పల్లి గ్రామానికి చెందిన బాకారపు ఆగయ్య (80) సంవత్సరాలు అనే వృద్ధుడు వ్యవసాయ బాయిలో పడి మృతి చెందాడు. కేశవపట్నం ఎస్సై దేశ్ చంద్రశేఖర్ తెలిపిన ప్రకారం ఆగయ్య కు వినికిడి సమస్యతో పాటు కళ్ళు కనబడడం లేదన్నారు. ఈనెల 23న ఆగయ్య ఇంట్లో నుండి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు,బంధువులు గాలింపు చేశారు. వృద్ధుడి ఆచూకీ లభ్యం కాలేదన్నారు. గురువారం వ్యవసాయ బావిలో వృద్ధుడు ఆగయ్య మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతురాలి భార్య వీరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.