చంటి పిల్లల ఎదుగుదల ప్రభుత్వ లక్ష్యం

Published: Saturday March 11, 2023

శంకరపట్నం మార్చ్ 10 ప్రజాపాలన రిపోర్టర్:


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి జిల్లా, మండలం, గ్రామ, గ్రామాలలోని అంగన్వాడీల ద్వారా పసికందులు, బాలలకు పౌష్టికఆహారాన్ని అదించి తల్లి, పిల్లల ఎదుగుదలనే లక్ష్యంగా  ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, తెలంగాణ బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు హనుమండ్ల శోభారాణి తెలిపారు. శంకరపట్నం మండల కేంద్రం  కేశవపట్నం అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం ఐసిడిఎస్ కరీంనగర్ రూరల్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రీ స్కూల్ మేళా జరిగింది. ఈ కార్యక్రమంలో స్పందన సేవా సంఘం ఆధ్వర్యంలో మహిళలు కుట్టిన దుస్తువులను కిడ్స్ మేళా నిర్వహించి, చిన్నారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శోభారాణి మాట్లాడుతూ మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వము గర్భం ధరించిన మహిళలకు, జన్మనొందిన పసికందులు, నెలల చంటి పిల్లలకు గ్రామ గ్రామాన అంగన్వాడిల ద్వారా పౌష్టిక ఆహారము అందజేస్తున్నదని తెలిపారు. ఈ  సేవలను సద్వినియోగం చేసుకోవాలని గర్భిణీ మహిళలకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ బండారి స్వప్న, ఎంపీటీసీ బొజ్జ కవిత, డిడబ్ల్యుఓ  సబిత, ఏసీడిపిఓ అరవింద, అంగన్వాడి సూపర్వైజర్ స్రవంతి, అంగన్వాడీ టీచర్లు కాంత, రాజమణి ,సోని, సుమలత, కమలాబాయి, పద్మావతి, భాగ్యలక్ష్మి, యశోద, కవిత, రాణి, స్వరూప, శిరీష, పుణ్యవతి, యశోద, భద్ర, సుభద్ర, ఆయాలు, గర్భిణీ స్త్రీలు, చంటి పిల్లల తల్లులు, చిన్నారులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.