గోనె ప్రకాశ్ రావు జాగ్రత్త అవాకులు చెవాకులు పేలకు.!

Published: Saturday December 18, 2021

తె.రా.స మండల శాఖ అధ్యక్షులు సింహాచలం జగన్

వెల్గటూర్, డిసెంబర్ 17 (ప్రజాపాలన ప్రతినిధి)  :  గోనె ప్రకాశ్ రావు జాగ్రత్త అవాకులు చెవాకులు పేలితే ఊరుకునేది లేదు జాగ్రత్త, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై చేసిన ఆరోపణలను ఖండిస్తూ శుక్రవారం రోజు వెల్గటూర్ మండల కేంద్రంలో మండల టి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు సింహాచలం జగన్ ఆధ్వర్యంలో గోనె ప్రకాష్ రావు దిష్టిబొమ్మను దహనం చేశారు. సింహాచలం జగన్ మాట్లాడుతూ గోనె ప్రకాశ్ రావు ను తీవ్రంగా హెచ్చరిస్తు ఇలాంటి మాటలు మానుకోవాలి లేకుండా తగిన శాస్తి చేస్తాం జాగ్రత్త మూత్యం లాంటి కొప్పుల ఈశ్వర్ కించపరిచే విధంగా చేస్తే ఊరుకునేది లేదు అని ఆయన ఖండించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జూపాక కుమార్, యువత అధ్యక్షులు బిడారు తిరుపతి, సహకార సంఘం అధ్యక్షులు గోలి రత్నాకర్, కునమల్ల లింగయ్య, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఏలెటి కృష్ణారెడ్డి, రైతుబంధు అధ్యక్షులు చొక్క శంకర్రావు, కోటిలింగాల దేవస్థానం చైర్మన్ పదిరె నారాయణరావు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు పోడెటీ సతీష్, ఎస్సి సెల్ అధ్యక్షులు కొప్పుల సురేష్, డాక్టర్ జగదీష్, రంగు తిరుపతి, మద్ది మురళి, బందెల నరసయ్య, బోడకుంటి రమేష్, పెద్దూరి భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.