ఘనంగా బంజారా తీజ్ ఉత్సవాలు

Published: Tuesday August 23, 2022
మేడిపల్లి, ఆగస్ట్ 22 (ప్రజాపాలన ప్రతినిధి) 
 పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో గోర్ బంజారా మేడిపల్లి కమిటీ ఆధ్వర్యంలో బంజారా తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో యువతి, యువకుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బంజారాలో వారి పండుగలు జరుపుకోవడానికి ప్రభుత్వం స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ కార్పొరేటర్ సుభాష్ నాయక్ ,బోడుప్పల్ కార్పొరేటర్ భూక్యా సుమన్ నాయక్, కాలనీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, గోర్ బంజారా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.