గ్రామపంచాయతీకి వీధిలైట్లు పంపిణీ చేసిన ఎన్నారై భాగం రాకేష్ ను అభినందించిన బోనకల్ గ్రామస్

Published: Saturday January 21, 2023

బోనకల్, జనవరి 20 ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని గ్రామపంచాయతీకి శుక్రవారం గోవిందాపురం (ఏ )గ్రామానికి చెందిన ఎన్నారై భాగం రాకేష్ బోనకల్ గ్రామపంచాయతీకి 30 వేల రూపాయల విలువ చేసే 12 ఎల్ఈడి వీధిలైట్లను గ్రామ సర్పంచ్ సైదానాయక్ కి వితరణ ఇవ్వటం జరిగినది. గ్రామ సర్పంచ్ సైదా నాయక్ మరో ఎనిమిది లైట్లు అడగగా ఇవ్వటానికి భాగం రాకేష్ సానుకూలంగా స్పందించినారు. దాతృత్వంతో గ్రామపంచాయతీకి వీధిలైట్లు పంపిణీ చేసిన ఎన్నారై భాగం రాకేష్ కు బోనకల్ గ్రామస్తులు ఎల్ఈడీ లైట్లు ఇచ్చినందుకు అభినందించినారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి దామళ్ళ కిరణ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.