ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్య*ఎంపీపీ లలిత మధిర జూన్ 14 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో

Published: Wednesday June 15, 2022

 ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతుందని మధిర మండల పరిషత్ అధ్యక్షురాలు మెండెం లలిత ఎంపీడీవో కుడుముల విజయ భాస్కర్ రెడ్డి మండల విద్యాశాఖ అధికారి వై ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని వంగవీడు ప్రాథమికోన్నత పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంతో పాటు ఉచితంగా పుస్తకాలు, భోజనం దుస్తులు అందించడం జరుగుతోందని వారు తెలిపారు. అంతేకాకుండా ప్రతిభ కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారన్నారు తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని వారు కోరారు. అనంతరం వంగవీడు పాఠశాలలో 7వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులను మధిర టివిఎం పాఠశాలలో చేర్పించాలని ఆ పాఠశాల ఉపాధ్యాయులు వంగవీడు వచ్చి తల్లిదండ్రులను కలిశారు. ఈ కార్యక్రమంలో మండల ఏఈ ప్రదీప్ సర్పంచ్ బొగ్గుల పద్మావతి విద్యా కమిటీ చైర్మన్ సత్యంబాబు  ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ రెడ్డి ఉపాధ్యాయుల  నరసింహారావు శ్యామల రావు గుల్జార్ సునీత కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు