కొండ లక్ష్మణ్ బాపూజీ వర్దంతి కి ఘన నివాళులు అర్పించిన జిల్లా గ్రంధాలయ చైర్మెన్ డా.గొల్లపల్ల

Published: Friday September 23, 2022

జగిత్యాల, సెప్టెంబర్ 21 (ప్రజాపాలన ప్రతినిధి): కొండ లక్ష్మణ్ బాపూజీ వర్దంతి సందర్భంగా ఫోటోకు పూలమాల వేసి ఆ మహనీయునికి జిల్లా గ్రంధాలయ చైర్మెన్ డా.గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ ఘన నివాళులు అర్పించినారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి కృషి మరువ లేనిది అని వారి విశిష్టత గురించి కొనియాడారు, మన స్వతంత్రం సాధించుకున్నమని గొప్ప నమ్మకంతోనే ఆయన ఇదే తెలంగాణకు నాంది పలకడం జరిగింది అని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా బీసీ సంఘం వారి ఆధ్వర్యంలో పద్మశాలి సేవా సంగం అధ్యక్షులు ఆకువత్తిని శ్రీనివాస్ కి మరియు సహాయ కార్యదర్శి భోగ రాజ్ కుమార్ లకు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు గాజుల నాగరాజు, పద్మశాలి సేవా సంఘము అధ్యక్షులు ఆకుబత్తిని శ్రీనివాస్, సహాయ కార్యదర్శి బోగ రాజుకుమార్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జనగం రాజిరెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కడప చంద్రశేఖర రావు, బిజెపి ఆర్ఎస్ఎస్ ఆర్గనైజర్ గుండేటి చంద్రమౌళి, గ్రంధాల సిబ్బంది, స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు.