*మధిర సేవా సమితి ఆధ్వర్యంలో మమ్మరంగా సేవా కార్యక్రమాలు*

Published: Saturday December 17, 2022

మధిర డిసెంబర్ 16 ప్రజా పాలన ప్రతినిధి మధిరలో పేదరిక నిర్మూలన కోసం మధిర సేవా సమితి ఆధ్వర్యంలో  ముమ్మరంగా సేవా కార్యక్రమాలు చేపట్టటం ఎంతో అభినందనీయమని ఆర్యవైశ్య సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు ఇరుకుళ్ళ లక్ష్మీనరసింహారావు తెలిపారు. శుక్రవారం వందనపు లక్ష్మయ్య వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు మధిర సేవా సమితి జాయింట్ సెక్రెటరీ వందనపు శ్రీనివాసరావు రాణి దంపతుల ఆర్థిక సహకారంతో మధిర  శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం ఆవరణ నందు నిరుపేద మహిళలకు దుప్పట్లు పంపిణీ చేసినారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు ఇరుకుళ్ల లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ మధిరలో మధిర సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేదల సంక్షేమ కొరకు నిరంతరం సేవా దృక్పథంతో సేవా కార్యక్రమాలు చేపట్టడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తండ్రి జ్ఞాపకార్థం నిరుపేద కుటుంబాలకు రగ్గులు అందజేసిన శ్రీనివాస రావు రాణి దంపతులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ సంఘం కన్వీనర్, మధిర సేవాసమితి అధ్యక్షులు పల్లపోతు ప్రసాదరావు, వైస్ ప్రెసిడెంట్ మిరియాల కాశీ విశ్వేశ్వరరావు గౌరవ సలహాదారు యర్రా లక్ష్మణరావు, ఇరుకుళ్ళ సురేష్, చల్లా సత్యనారాయణ, చేడే అర్జున్, కృష్ణ, చల్లా విక్రమ్ వందనపు శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.