రాహుల్ యాత్రలో పాల్గొనే కాంగ్రెస్ నాయకుల వివరాలను అందజేయాలి

Published: Friday October 07, 2022

మధిర అక్టోబర్ 6 ప్రజా పాలన ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారతజోడో యాత్రలో పాల్గొనే కాంగ్రెస్ కార్యకర్తలు తమ వివరాలను అందించాలని పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిరియాల రమణ గుప్తా గురువారం ఒక ప్రకటనలో కోరారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ  చేపట్టినటువంటి భారత్ జోడో  పాదయాత్ర ఈ నెల 24 నుండి తెలంగాణలోకి ప్రవేశించనుందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్రలో స్వచ్చందంగా పాల్గొనదలచిన ఉత్సాహవంతులైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వారికి సంబంధించిన ఆధార్ కార్డు జిరాక్స్, ఒక పాస్ పోర్ట్ ఫోటో  మీ మొబైల్ నంబర్ తదితర వివరాలను ఈ నెల 8 తేదీ సాయత్రం 5 గంటలలోపు పట్టణ కాంగ్రెస్ కమిటీకి అందజేయాలని ఆయన పేర్కొన్నారు. సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క విక్రమార్క ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో చేపట్టనున్న రాహుల్ భారత్ జోడో యాత్రకు ఘనంగా స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.