కోవిడ్ అవేర్నెస్ కోసం సైకిల్ ర్యాలీ
Published: Monday July 05, 2021
బెల్లంపల్లి, జూలై 4, ప్రజాపాలన ప్రతినిధి : కోవిడ్ అవేర్నెస్ కోసం బెల్లంపల్లి లోని ఏఏం సి గ్రౌండ్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు నిర్వహించిన పది కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. అనంతరం ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలో ఎన్నో రకాల సంక్షేమ, అభివృద్ధి, కార్యక్రమాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు భావన రుషి, తెరాస నాయకులు నర్సింగం, కొమ్మేర లక్ష్మణ్, రెవెల్లి విజయ్, అనిల్, కొట్టే వినయ్, కమల్ షార్ధ, చెవిటి సుదర్శన్, లయన్స్ క్లబ్ సభ్యులు వినోద్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: