కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి: గౌడ సంఘం అధ్యక్షులు మిర్

Published: Monday April 25, 2022
బోనకల్, ఏప్రిల్ 24 ప్రజాపాలన ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అన్ని చేతివృత్తుల వారిని ఆదుకుంటామని, వారికి పలు రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారని రావినూతల గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడు మిరియాల నాగేశ్వరావు అన్నారు. చేతి వృత్తుల్లో అతిముఖ్యమైన గౌడ కులస్తులకు ప్రభుత్వం విస్మరించిందని, కల్లుగీత కార్మికులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని, అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేయాలని 2018 లో తెలంగాణ ప్రభుత్వం ద్విచక్రవాహనాలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఇంతవరకు ఇచ్చిన హామీలను ప్రభుత్వ నెరవేర్చలేదని గుర్తు చేశారు. వాటిని వెంటనే అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.