ఉద్యమనాయకుడు దావల్ గారి మహేందర్ రెడ్డి ఏడవ వర్ధంతి

Published: Friday March 03, 2023
* చెవెల్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
వికారాబాద్ బ్యూరో 02 మార్చి ప్రజాపాలన : నవాబుపేట్ మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామ వాస్తవ్యుడు తెలంగాణ ఉద్యమకారుడు కీ.శే. దావల్ గారి మహేందర్ రెడ్డి ఏడవ వర్ధంతిని పురస్కరించుకుని తిమ్మారెడ్డిపల్లి గేటు వద్ద ఆయన విగ్రహానికి చెవెల్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, జెడ్పి వైస్ చైర్మన్ బైండ్ల విజయకుమార్ తో కలిసి పూలమాలలు వేసి  నివాళులు అర్పించారు .ఈ కార్యక్రమంలో నవాబుపేట్ మండల టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కందాడ నాగిరెడ్డి, వికాస్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ , సీనియర్ నాయకుడు రంగారెడ్డి, ప్రకాశం, కేదార్ నాథ్, ప్రభాకర్ రెడ్డి , శాంతి కుమార్ , ధర్మయ్య మహేందర్ రెడ్డి, రఘుపతి రెడ్డి,సుజీత్ , ప్రేమ్ రాథోడ్, సత్తి రెడ్డి, వెంకట్ రెడ్డి ,శ్రీనివాస్ రెడ్డి, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.