పట్టణ ప్రగతి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మహేష్ రెడ్డి

Published: Tuesday July 06, 2021
పరిగి 5 జూలై ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో మూడో విడత పట్టణ ప్రగతి- హరితహారం లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం మూడవ వార్డు ల పార్క్ ను ఏడవ వార్డు 8వ వార్డు పట్టణ ప్రగతి పనులను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్ చైర్ పర్సన్ ప్రసన్న లక్ష్మి కమిషనర్ అరుణ్ కుమార్ తెరాస సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి కౌన్సిలర్స్ వెంకటేష్, రవికుమార్, కిరణ్ కుమార్ గొల్ల రాములమ్మ నాయకులు మల్లేష్ మహిళా అధ్యక్షురాలు లక్ష్మి మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు