పీర్జాదిగూడలో సకల సౌకర్యాలతో సమీకృత శాఖహారా మాంసాహార మార్కెట్

Published: Wednesday November 16, 2022
    మేయర్ జక్క వెంకట్ రెడ్డి 
మేడిపల్లి, నవంబర్ 15 (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు సకల సౌకర్యాలతో సమీకృత శాఖహారా, మాంసాహార మార్కెట్ ను ఏర్పాటు చేస్తున్నామని మేయర్ జక్క వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు నాణ్యమైన,సరసమైన ధరలకే ఆహారం అందించాలనే లక్ష్యంతో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిదిలో సుమారు రూ. ₹7.50 కోట్లతో నిర్మితమవుతున్న సమీకృత శాఖహారా, మాంసాహార మార్కెట్ నిర్మాణ పనులను మేయర్ జక్క వెంకట్ రెడ్డి, మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్బంగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నగర ప్రజలకు తాజా కూరగాయలు, ఆకుకూరలు,పండ్లు,పూలతో పాటు  మాంసం ప్రియులకోసం ప్రత్యేకంగా మటన్, చికెన్, చేపలు,రొయ్యలు మొదలైనవన్ని ఒకేచోట అందించాలనే లక్ష్యంతో అందరికి అందుబాటులో అత్యాధునిక హంగులతో సమీకృత శాఖాహార, మాంసాహార మార్కెట్ నిర్మిస్తున్నామని తెలిపారు. ఇలా ఒకవైపు ప్రజలకు మౌళిక సదుపాయల కల్పనకు పెద్దపీట వేస్తూ, మరోవైపు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నగరాన్ని ప్రణాళికబద్దంగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కౌడే పోచయ్య, డీఈ శ్రీనివాస్, ఏఈ వినీల్ కుమార్,నాయకులు జావీద్ ఖాన్, కాంట్రాక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.