అన్నారుగూడెం పాఠశాలలోగణిత దినోత్సవం..

Published: Friday December 23, 2022
తల్లాడ, డిసెంబర్ 22 (ప్రజాపాలన న్యూస్):
 తల్లాడ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత పితామహుడు శ్రీ శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా గురువారం గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గణిత శాస్త్ర అంశాలు, ప్రతిబింబించే విధంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. అంతేకాకుండా క్విజ్,  వ్యాస రచన పోటీలు నిర్వహించి గణిత శాస్త్ర ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తుమ్మా సునీత, మాదినేని నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.