తల్లీబిడ్డలకు పోషకాహారాన్ని అందించడంతోనే సంపూర్ణ ఆరోగ్యం : కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్

Published: Thursday September 23, 2021
మేడిపల్లి, సెప్టెంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి) : గర్బిణులకు, శిశువులకు పోషకాహారాన్ని అందించడంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఉప్పల్ కార్పొరేటర్ మందముళ్ళ రజిత పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో కూడా  ఎక్కువ పోషకాలు లభించే ఆహారాన్ని ఇళ్లల్లో తయారు చేసుకోవచ్చన్నారు. జాతీయ పోషణ మాసాన్ని పురస్కరించుకొని ఉప్పల్లోని అంగన్ వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి, చిలుకానగర్ బన్నాల గీత ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా గర్భిణులకు సీమంతాలు, చిన్నారులకు అక్షర అభ్యాసాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ స్వాతి, సూపర్ వైజర్ పార్వతి, అంగన్ వాడీ టీచర్స్, తదితరులు పాల్గొన్నారు.