విఅర్ఏ సమస్యలు పరిష్కరించాలని పారిశుధ్యా పనులతో నిరసన

Published: Thursday August 04, 2022

జన్నారం, జూలై 26, ప్రజాపాలన: రాష్ట్ర విఅర్ఏ కమిటీ నిర్ణయా మేరకు, మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని తాహసిల్థర్ కార్యాలయం ముందు విఅర్ఏ సమస్యలు పరిష్కరించాలని పారిశుధ్యా పనులతో నిరసన తెల్పిన మండల విఅర్ఏ  అధ్యక్షుడు జగ్గిషేట్టి రాజశేఖర్ బుధవారం అన్నారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ విఅర్ఎలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామిలు అన్ని చెప్పి, వాటిని అమలు చేయడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. విఅర్ఏ సమస్యలు పట్టించుకోకుండా వదిలేసిందని వారి ప్రదాన డిమాండ్లు అయిన  పే, స్కేల్, జీవోను వేంటనే విడుదల చేయాలని, అర్హత గల విఅర్ఏ లకు ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని, యాబైఐదు సంవత్సరముల పైబడిన విఅర్ఏ స్థానంలో వారసులకు ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యాక్రమంలో విఅర్ఏ మండల ఉపాధ్యక్షుడు దాసండ్ల రాజలింగు, ప్రధాన కార్యదర్శి కాసారపు శీనివాస్, కోశాధికారి బోడ్డు రాజుకుమార్,  ప్రచార కార్యదర్శులు గుమ్ముల శ్రీనివాస్, ముగ ప్రసాద్, మగ్గిడి దేవయ్య, తదితరులు పాల్గొన్నారు.