షటిల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత. బూర్గ
ఈనెల 26 నుండి నిర్వహిస్తున్నటువంటి గాంధీనగర్ గణేష్ లయన్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన షటిల్ టోర్నమెంట్ ఫైనల్స్ లో , సాయి కిరణ్, మనోజ్ లు విన్నర్స గా నిలిచారు ., రన్నర్స్ భూక్యా కృష్ణ, ములకలపల్లి నాగరాజు నిలిచారు.వీరికి బహుమతులు అందచేయడానికి,ముఖ్య అతిధులుగా విచ్చేసిన బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత , వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ , టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీను , సానికొమ్ము శంకర్ రెడ్డి , టిఎన్టిఈసి యూనియన్ అధ్యక్షుడు కనకమెడల హరిప్రసాద్, గ్రామ పెద్ద కిషన్ నాయక్ , బిఎన్ఆర్ సంస్థ అధ్యక్షులు నాగేశ్వరరావు ఆంజనేయులు , భద్రు , వీరయ్య బీమా , బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి కామారెడ్డి శ్రీలత మాట్లాడుతూ ఆటలు అనేవి మానసిక ఉల్లాసానికి ఎంతో తోడ్పాటు అందిస్తాయని ఇండోర్ గేమ్స్ అయినటువంటి షటిల్ టోర్నమెంట్ ఎంతో ఉత్సాహంగా ఉంటుందని ఈ కాలంలో ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క మానసిక ఉల్లాసానికి ఆటలు ఎంతో అవసరమని క్రీడలతో ఎంతో ఒత్తిడి నుంచి బయటపడవచ్చు అని వారి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగినది.
Share this on your social network: