మైనారిటీ నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ
Published: Wednesday April 13, 2022
జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిని సుధారాణి
వికారాబాద్ బ్యూరో 12 ఏప్రిల్ ప్రజా పాలన : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో జారీ చేయనున్న వివిధ ఉద్యోగ నియామక నోటిఫికేషన్ లో భాగంగా మైనారిటీ సంక్షేమ శాఖ, వికారాబాద్ జిల్లా ఆధ్వర్యంలో డిగ్రీ పూర్తి చేసిన మైనారిటీ నిరుద్యోగ యువతి యువకులకు గ్రూప్ -1 నుండి గ్రూప్ -4 వరకు పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇవ్వబడునని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిని సుధారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి శిక్షణ కేంద్రము స్థానిక శ్రీ.అనంత పద్మనాభ కళాశాల (SAP) మరియు చిరాగ్ ఉర్దూ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ బిటిఎస్ కాలనీ శివరాంనగర్, వికారాబాద్ లలో ఏర్పాటు చేసినట్లు తెలియజేసినారు. నిష్ణాతులైన అధ్యాపకులచే శిక్షణ తరగతులు నిర్వాహంచబడునని, ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాములకు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యక్రమం, కలెక్టరేట్, బూరుగుపల్లి, రూమ్ నం. 06 లో సంప్రదించాలని తెలిపారు.
Share this on your social network: