గచ్చిబౌలిలో శ్యాంప్రసాద్ ముఖర్జీకి ఘనంగా నివాళులర్పించిన రాష్ట్ర బిజెపి నాయకులు రవికుమార

Published: Thursday June 24, 2021

శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్ పాల్గొని చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. రాష్ట్ర బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ దేశానికి ఒకే జెండా ఒకే రాజ్యాంగం ఒకే ప్రధాని ఉండాలి" అని నెహ్రూ తీసుకువచ్చిన 370 ఆర్టికల్ ని వ్యతిరేకించిన  మహోన్నత వ్యక్తి అని కులమతాలకు అతీతంగా దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలందరి పై ఉంది అన్న వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ అని, ఆ ఆశయంతోనే భారతీయ జన సంఘం స్థాపించడం జరిగింది అని  ప్రస్తుతం భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించిందని అన్నారు. అనంతరం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ అఖండ భారతదేశ స్ఫూర్తిని గుండెగుండెలోనూ రగిలించిన  జాతీయవాది, నిరాండబరతకు నిదర్శనంగా నిలిచిన జననేత, దేశభక్తికి నిలువుటద్దంగా నిలిచిన స్ఫూర్తిప్రదాత డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్థంతి సందర్భంగా ఆ మహనీయుని నివాళులు అర్పిస్తున్నాను అని అన్నారు. భారత దేశంలో సంపూర్ణంగా విలీనమైన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఉద్యమం ప్రారంభించారు అని అన్నారు. కాశ్మీర్ కోసం ప్రాణ త్యాగం చేసిన మహానీయుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, సీనియర్ నాయకులు విఠల్, శ్రీరాములు, రమేష్, సుబ్రమణ్యం, విజయ్, శ్రీశైలం, నర్సింగ్ రావు, శ్రీకాంత్, ప్రశాంత్, క్రాంతి, వెంకటేష్, విష్ణు, వెంకటేష్, జీవ, తదితరులు పాల్గొన్నారు.