దండెపెల్లి మండలం లో పర్యటించి న స్వచ్చ సర్వేక్షన్ టీం సభ్యులు.

Published: Wednesday December 29, 2021
మంచిర్యాల బ్యూరో‌, (దండేపల్లి) , డిసెంబర్ 28, ప్రజాపాలన : స్వచ్చ సర్వేక్షన్ (గ్రామీణ)లో భాగంగా ఎస్ఎస్ జి-2021 టీం సభ్యులు, సునీల్ కుమార్ గౌడ్ మంగళవారం దండేపల్లి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని మేదరిపేట గ్రామపంచాయతీలో అభివృద్ధి పనులు సమిక్షించారు. మేదరిపేట గ్రామపంచాయతీ యొక్క గ్రామీణ పారిశుద్ధ్యం, వారాంతపు సంత నిర్వహణ, అంగన్ వాడీ కేంద్రాలు, డ్రైనేజీలు, డంపింగ్ యార్డు, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు తదితర అంశాలను సందర్శించి పర్యవేక్షించినారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ టి. శ్రీనివాస్, ఎంపీడీఓ, ఎంపిఒ పి. మేఘమాల, సర్పంచ్ డాంక లక్ష్మన్, ఎంపిటిసి కొంగల నవీన్, ఉప సర్పంచ్ గందె రమేష్, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.