విజయగర్జన సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన ఖైరతాబాద్ ఎం ఎల్ ఎ దానం నాగేందర

Published: Thursday October 28, 2021
హైదరాబాద్(ప్రజాపాలన సిటీ బ్యూరో) : సోమాజిగూడ లోని జయ గార్డెన్ లో టి ఆర్ ఎస్ పార్టీ జెండాను ఖైరతాబాద్ ఎం ఎల్ ఎ దానం నాగేందర్ ఆవిష్కరించారు. ఖైరతాబాద్ నియోజకవర్గ టి ఆర్ ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ 15న వరంగల్ లో జరగబోయే విజయగర్జన సభలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. మేయర్ గద్వాల విజయ లక్ష్మి, మాట్లాడుతూ నూతనంగా నియమితులైన అన్ని కమిటీల సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఎక్కడా లేనన్ని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లే భాద్యత కార్యకర్తలదే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు మేయర్ గద్వాల విజయ లక్ష్మి, కార్పొరేటర్ లు వనం సంగీత యాదవ్, మన్నే కవితారెడ్డి తదితరులు పాల్గొన్నారు...