మాతశిశు హాస్పిటల్ ను ప్రజలకి అందుబాటు లోకి తీసుకురావాలి

Published: Wednesday August 03, 2022

మంచిర్యాల టౌన్, ఆగష్టు 02, ప్రజాపాలన: మాతశిశు హాస్పిటల్ ను ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని, డి వై ఫ్ ఐ జిల్లా కార్యదర్శి అరిగెల మహేష్ డిమాండ్ చేశారు.   మంగళవారం  మాతాశిశు హాస్పిటల్ ను సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  జిల్లా కేంద్రం లోని మాత శిశు హాస్పిటల్ పని చేయకపోవటంతో గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన గర్భిణులు, బాలింతలు ఆర్థిక స్థోమత లేకపోయినా ప్రైవేట్ హాస్పిటల్స్ ను ఆశ్రయించాల్సి వస్తోంది అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాతాశిశు హాస్పిటల్ ను ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. లేని పక్షంలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ఆధ్వర్యలో పలు ఆందోళనలు  నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాజ్ కుమార్, రాజశేఖర్ పాల్గొన్నారు.