కరోనాను అరికట్టడంలో ప్రజలు భాగస్వాములు కావాలి: కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్రావు

Published: Tuesday May 11, 2021
మేడిపల్లి, మే10 (ప్రజాపాలన ప్రతినిధి) : కరోనాను అరికట్టడంలో సామాజిక బాధ్యతతో ప్రజలు భాగస్వాములు కావాలని రామంతాపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా డివిజన్లోని రామంతాపూర్ భగాయత్ బాలకృష్ణ కాలనీ, సాయి క్రిష్ణ కాలనీలలో కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారి చేయించారు. కరోనా పట్ల ప్రజలందరూ జాగ్రత్తలు వహించాలని కార్పొరేటర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బండారు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి సంకూరీ కుమారస్వామి, తిరుపతయ్య, శైలేందర్, రాము, సురేష్ గౌడ్ కాలనీవాసులు ఇల్లిట్టం నరసింహారెడ్డి, నిరంజన్ గౌడ్, టిక్కా రెడ్డి, చందర్ రాయుడు తదితరులు పాల్గొన్నారు.