రాజు భవన్ ముట్టడిని విజయవంతం చేయండి సిపిఐ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ రేగుంట చంద్రశే

Published: Tuesday December 06, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 5 ప్రజా పాలన ప్రతినిధి:  డిసెంబర్ 7వ తేదీన జరుగు చలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్  రేగుంట చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు.
 బెల్లంపల్లి నియోజకవర్గం లోని తాండూర్ మండలంలో సోమవారం ఏర్పాటు చేసిన  సమావేశంలో ఆయన మాట్లాడారు, గవర్నర్ వ్యవస్థ బ్రిటిష్ కాలం నుండి ప్రజాతంత్ర ,ప్రభుత్వాలు లేకుండా పరిపాలన  సాగిస్తున్న క్రమంలో స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా.. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల నుండి ఈ గవర్నర్ వ్యవస్థను ఏజెంట్లుగా మార్చుకొని దేశవ్యాప్తంగా బిజెపేతర రాష్ట్ర  ప్రభుత్వాలు కలిగిన కేరళ తమిళనాడు పుదుచ్చేరి ఢిల్లీ తెలంగాణ లాంటి రాష్ట్రాలలో ఎమ్మెల్యేలనుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కూల దోస్తు ఆ ప్రభుత్వాన్ని పడగొడుతూ మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలో భాగంగా గవర్నర్ వ్యవస్థ పని చేస్తున్నదని, ఆయా రాష్ట్రాల అభివృద్ధిలో భాగంగా ప్రవేశపెట్టిన బిల్లులను కూడా ఆమోదించకుండా బిజెపి ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మగా మారిన గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
 ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మామిడాల రాజేశం, బయ్య మొగిలి, భాస్కర్, మల్లయ్య, పట్టి శంకర్ ,తదితరులు పాల్గొన్నారు.