మధిర, ఎర్రుపాలెం మండలం రైతులందరికీ విజ్ఞప్తి
Published: Wednesday April 27, 2022
మధిర ఏప్రిల్ 26 ప్రజాపాలన ప్రతినిధి నియోజకవర్గ పరిధిలో మీకు సంబంధించిన వ్యవసాయ భూమిలో విద్యుత్ లైన్ల కింద సుబాబుల్ మరియు ఇతర పొడవైన చెట్లు ఏపుగా పెరిగి విద్యుత్ లైన్లకు తగిలి విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడడం వలన విద్యుత్ వినియోగదారులకు మరియు రైతులకు అదేవిధంగా విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అంతే కాకుండా పొడవుగా పెరిగిన చెట్లు విరిగి విద్యుత్ లైన్ల పై పడితే విద్యుత్ లైన్లు తెగిపోయి మనుషులకు, మూగజీవులకు ప్రాణ నష్టం కలిగే అవకాశం ఉంటుంది. అదే విధంగా విద్యుత్ శాఖ కూడా ఆర్థిక పరంగా నష్టం వాటిల్లో అవకాశం ఉంది. కావున రైతులందరూ కూడా విద్యుత్ లైన్ల కింద ఉన్నటువంటి పెరిగిన చెట్లను తొలగించుకో వలసినదిగా విద్యుత్ శాఖ మధిర సబ్ డివిజన్ ADE CH సుధాకర్ తెలియజేస్తున్నారు.
Share this on your social network: