ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాం నామినేషన్ కు పట్టభద్రులు అధిక సంఖ్యలో పాల్గొనాలి
Published: Monday February 22, 2021
వలిగొండ ప్రజాపాలన: టీజేయస్ పార్టీ మండల అధ్యక్షులు బుంగ సునిల్ పిలుపు ఇచ్చారు. ఎమ్మెల్సీ గా ప్రొఫెసర్ కోదండరాం సార్ ఈ నెల 22న సోమవారం రోజున నల్లగొండ కలెక్టరేట్ కార్యాలయంలో భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేయబోతున్నారు. కాబట్టి ఉమ్మడి నల్లగొండ జిల్లాల నుంచి పట్టభద్రులు అధిక సంఖ్యలో పాల్గొనాలని టీజేయస్ మండల అధ్యక్షుడు బుంగ సునిల్ పిలుపు నిచ్చారు. మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ పట్టభద్రులు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రశ్నించే గొంతుక నిరుద్యోగ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ రైతు సమస్యలను ఉద్యోగ సమస్యలకు ఎల్లవేళలా ఎలుగెత్తి చాటుతూ ఉన్నటువంటి ప్రొఫెసర్ కోదండరాం గెలుపు కోసం కృషిచేసి మొదటి ప్రాధాన్యత కోదండరాం కు ఓటు వేయాలని కోరారు.
Share this on your social network: