పిల్లలకు నోట్ బుక్స్ పంపిణీ చేసి పెద్ద మనసు చాటుకున్న ఐటీసీ బిఎంఎస్ యూనియన్ అధ్యక్షులు బిజ్

Published: Wednesday November 02, 2022

 నేడు బూర్గంపాడు మండల కేంద్రం లోని శిశు మందిర్  పాఠశాలలో ఐ టి సి -  బి ఎం ఎస్ యూనియన్  తరపున ఆఫీస్ టేబుల్ ను వితరణగా ఇవ్వడం జరిగింది.అలాగే  ఐ టి సి  యాజమాన్యం ద్వారా పిల్లలందరికీ   నోట్ బుక్స్ అందించడం జరిగింది. నోట్ బుక్స్ అందించడంలో సహకరించిన ఐటీసీ యాజమాన్యం చంగల్ రావు  వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.  ప్రతి పేద పిల్లవాడు చదువుకోవాలని , పిల్లలందరికీ బిస్కెట్లు అందించిన ఈ కార్యక్రమంలో ఐ టి సి బి ఎం ఎస్  యూనియన్ అధ్యక్షులు బిజ్జం అశోక్ రెడ్డి, యూనియన్ ప్రతినిధులు అక్కెర శ్యాం కుమార్, పాల సంతోష్ రెడ్డి మరియు స్కూల్ యాజమాన్యం నాగ మల్లేశ్వరి పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.