మధిర జూలై 19 ప్రజాపాలన ప్రతినిధి మంగళవారం నాడుమండలంలో,
Published: Wednesday July 20, 2022
పరిధిలోరాయపట్నం గ్రామంలో, ఐ టి సి-ఎం.ఎస్.కె వారి సహకారంతో ఆదర్శ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో రాయపట్నం ఏబీసీ గ్రూప్ సభ్యులకు వరి డ్రమ్ సీడర్ ను అందజేయడం జరిగింది. ఈ డ్రమ్ సీడర్ సహాయంతో వరిసాగు విధానం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది, ఈ వరి సాగు విధానం వల్ల రైతులకు, ఎకరానికి సుమారు ఏడు వేల రూపాయలు వరకు కూలీ ఖర్చులు మిగులుతాయని మరియు నీటిని కూడా ఆదా చేసుకొని వ్యవసాయం చేయొచ్చు అని ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డి. సత్యనారాయణ తెలియచేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో రాయపట్నం ఏ.ఇ.ఓ అఖిల ప్రియ, గ్రామ సర్పంచ్ నండ్రు సుశీల మరియు మండల కమ్యూనిటీ ఆర్గనైజర్ యం. రాజీవ్ గాంధీ, మరియు రైతులు నండ్రు తిమోతి, కంచెం గోపి, ఇశ్రాయేలు, రవితేజ, గోళ్ళ వీరస్వామి, పూర్ణయ్య తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: