ఐద్వా మహిళా సంఘం కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర అధ్యక్షురాలు పద్మ

Published: Friday November 11, 2022
 జన్నారం, నవంబర్ 10, ప్రజాపాలన:  మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని రామ్ నగర్ లో ఏర్పాటు చేసిన ఐద్వా మహిళా సంఘం మండల కార్యాలయాన్ని బుధవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక రాష్ట్ర అధ్యక్షురాలు పద్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి దృష్టి పెడుతున్నామన్నారు. ఈ సందర్భంగా మహిళల సమస్యల పరిష్కరించడానికి నిర్వహించే ఉద్యమా పోరాటాలలో ఐద్వా మహిళా సంఘం ముందు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళల పై జరుగుతున్న దాడులకు చట్టు ప్రకారంగా న్యాయం చేకూరే వరకు ఐద్వా మహిళా సంఘం ముందుంటుందడలని అమె కోరారు. ఇప్పటికైనా పలు వివిధ కారణాల చేత మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ప్రభుత్వం ముందుండి న్యాయం చేయాలని, వాటిపై పోరాట ఉద్యమాలలో పాల్గొంటున్న ఐద్వా మహిళా సంఘం మండల అధ్యక్షురాలు పోతు విజయశంకర్ (సిపిఎం) ను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో జన్నారం ఐద్వా మహిళ సంఘం మండల అధ్యక్షురాలు పోతు విజయ శంకర్, తెలంగాణ వ్యవసాయ కార్మిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మ, పలువురు మహిళలు, తదితరులు పాల్గొన్నారు.